మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తనపై నమోదైన కేసు గురించి మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తన మీద సీఐడీ కేసు నమోదైనట్లు తెలియదన్న అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనని స్పష్టం చేశారు.
Continue Read
భారతీయ జనతా పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న షెహజాద్ పూనావాలా ఆ పదవికి రాజీనామా చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని, ఇప్పటికే రాజీనామా పత్రాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Continue Read
అక్షర కిరణం, (మధ్యప్రదేశ్/జాతీయం): మధ్యప్రదేశ్కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. తన పొరుగు నియోజకవర్గానికి చెందిన గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి రాగా... వారితో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. “తనకు ఓటు వేసిన వారు కాదంటూ” వారి సమస్యలను వినడానికి ఆయన నిరాకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి నిరసనగా.. ఎమ్మెల్యే కారు బోనెట్పై తన చేతిలో ఉన్న చిన్న పాపను పడుకోబెట్టాడు.
Continue Read
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి 202 స్థానాలను కైవసం చేసు కుని అద్భుత విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రికార్డు స్థాయిలో నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Continue Read
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మరోసారి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఓ మంచి పని చేయబోతున్నారు. ముఖ్యంగా రద్దీ నిర్వహణ, ప్రజా భద్రతను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక వాలంటీర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ‘తొండర్ అని’ అని పేరు పెట్టారు.
Continue Read
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వైఎస్ జగన్ లండన్ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేసిన పిటిషన్ను నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది.
Continue Read
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న వేళ.. విపక్ష మహాఘట్బంధన్ కీలకమైన ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల కొన్న సందిగ్ధతకు తెరదించింది. ఓవైపు సీట్ల విషయంలో గొడవ జరుగుతుండగానే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి అభ్యర్థులను ఖరారు చేసేసింది. కూటమిలో భాగ స్వామ్య పార్టీలన్నీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే మొగ్గు చూపి.. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడానికి అంగీకారం తెలిపాయి.
Continue Read
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష కూటముల్లో టికెట్ల రచ్చ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. సిట్టింగ్ స్థానం దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఏకంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.
Continue Read