వామన -నృసింహ స్వామి అవతారంలో జగన్నాథుడు
అక్షర కిరణం, (వన్టౌన్): బలభద్ర సుభద్ర సమేత జగన్నాధ స్వామి వారు మంగళవారం వామన, నృసింహ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామికి నాద స్వరం, లలిత సహస్ర నామార్చన, మేలు కొలుపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ గావించారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఫెస్టివల్ ఆఫీసర్ టి అన్నపూర్ణ పర్య వేక్షణలో జగన్నాధ స్వామి దేవస్థానం ఈఓ టి. రాజగోపాల రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 800 మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. సాయంత్రం బాలలీలామృతం భరత నాట్యం పిల్లలచే నిర్వహించారు.